జూలై 2 న వేముల మహేందర్ సంతాప సభ

Published: Tuesday June 29, 2021
 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి పట్టణ కేంద్రంలోని సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జులై 2న శివసాయి పంక్షన్ హాల్ లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేముల మహేందర్ సంతాప సభ నిర్వహించడం జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ తెలిపారు. ఈ మాట్లాడుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఇటీవల కాలంలో క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయిన వేముల మహేందర్ సంతాప సభ సిపిఎం నిర్వహించడం జరుగుతుందని అదే సందర్భంగా సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారని, ఈ సంతాప సభకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుకుపల్లి సీతారాములు హాజరవుతున్నారని, ఈ సంతాప సభలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు, జిల్లా మండల ప్రజా సంఘాలు, సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, సిపిఎం మండల కమిటి సభ్యులు తుర్కపల్లి సురేందర్, సిపిఎం మండల కమిటీ సభ్యులు చిరక శ్రీశైలం రెడ్డి, కూర శ్రీనివాస్, మెరుగు వెంకటేశం.గాజుల ఆంజనేయులు, వాకిటి వెంకటరెడ్డి. కొండే కిష్టయ్య, కర్ణకంటి యాదయ్య, కల్కురి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.