కార్పొరేషన్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషీ : మేయర్

Published: Friday October 01, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు  కార్పొరేషన్ మేయర్. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ కార్పొరేటర్ రాళ్ల గూడెం సంతోషీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీరప్ప కాలనీ లలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. అనంతరం కాలనిలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భాలలో ఆమె మాట్లాడుతూ..... పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. కాలనీలో పరిశుభ్రతను ప్రతి ఒక్కరు బాధ్యతగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు రాళ్లగూడెం సంతోష శ్రీనివాస్ రెడ్డి, ఏఈఈ బిక్కు నాయక్, నాయకులు లిక్కి కృష్ణ రెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.