బదిలీపై వెళ్లిన ఎస్సైకి సన్మానం

Published: Wednesday December 29, 2021
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని గత రెండు నెలల నుంచి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా  విధులు నిర్వహిస్తున్న టువంటి  జి సురేష్ ఎస్సై ఇబ్రహీంపట్నం గారికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాలేశ్వరం జోన్ కు బదిలీ అయినందున మెట్పల్లి డి.ఎస్.పి వంగ రవీందర్ రెడ్డి గారు శాలువతో ఎస్సై సురేష్ గారిని సన్మానించడం జరిగినది ఇట్టి ఈ కార్యక్రమంలో మెట్ పెళ్లి సీఐ శ్రీను గారు మరియు మెట్పల్లి ఎస్ఐ సధాకర్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంలో సురేష్ గారు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో రెండు నెలలు విధులు సజావుగా నిర్వహించడంలో, శాంతి భద్రతలు కాపాడడంలో నాకు సహకరించిన అటువంటి పోలీస్ సిబ్బందికి మరియు ప్రెస్ మిత్రులకు మరియు మండల ప్రజలకు, రాజకీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపినారు