కొందుర్గు మండల కేంద్రం లో తెరాస పార్టీ ఆధ్యర్యoలో మీడియా సమావేశం
కొందుర్గు మండల కేంద్రం లో మండల తెరాస పార్టీ అధ్యక్షులు ఎలుగంటి శ్రీధర్ రెడ్డి మండల ప్రజా ప్రతి నిధుల ఆధ్యర్య లో మీడియా సమావేశం నిర్వహించడము జరిగింది.. సమావేశం లో pacs చైర్మన్ చిట్టెం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ షాద్ నగర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే అంజన్న గారు చేసిన అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక వారి పైన వారి కుటుంబ సభ్యులపైన నిరాదార ఆరోపనలు చేయడం మంచిది కాదు అన్నారు. మండల వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ మాట్లాడుతు ఎమ్మెల్యే గా అంజన్న కొందుర్గు మండలములో మట్టి రోడ్డు ఉన్న గ్రామాలకు, బిటి రోడ్లు వేసి, మిగతా బ్రిడ్జి పనులు, కల్వర్ట్ పనులకు మంజూరు కోసం నిరంతరం పని చేస్తున్నారు అని. కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ ఇంచార్జి స్థాయికి మించి మాట్లాడుతూ ఎమ్మెల్యే పైన కేసీఆర్ పైన వ్యక్తి గత దూషణలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. రానున్న రోజుల్లో సరైన బుద్ది చెబుతాము అన్నారు.. సర్పంచుల సంఘo అధ్యక్షులు సనుగముల నర్సింహా రెడ్డి మాట్లాడుతు గత 70 యేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసి గ్రామాలను అభివృద్ధి చేయలేదు కానీ తెలంగాణ తెచ్చి కేసీఆర్ ముఖ్య మంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ఎమ్మెల్యే గా అంజన్న తక్కువ సమయం మండలము లో అభివృద్ధి పనులు చేపట్టి షాభాద్ రోడ్డు, చుక్కమెట్టు రోడ్డు, పర్వతా పూర్ రోడ్డు,విశ్వనాథ్ పూర్ రోడ్డు,గంగన్న గూడా రోడ్డు చించేడ్ రోడ్డు,వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు వేసి గ్రామాల లో మౌలిక సదుపాయాలు పూర్తి చేయడం జరిగింది అని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షాద్ నగర్ నియోజకవర్గం లో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే చేయలేదూ అని ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కుయటం బంధు చేయాలి అని మరోసారి కేసీఆర్ ని అంజన్నని ఉద్దేశించి చిల్లర గా మాట్లాడితే బాగుoడదు అని హెచ్చరిoచ్చారు.రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రెడ్డి నర్సిములు మాట్లాడుతు.. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కు తెచ్చుకొని కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్, ఎమ్మెల్యే అంజన్న పైన సెటైర్లు వేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలి అని హెచ్చరించారు.జడ్పీటీసీ కుమారుడు ఎదిర రామ కృష్ణ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం, ఎమ్మెల్యే అంజన్న గారు చేస్తున్న పనులు మీకు కనిపిస్తలెవా గుడ్డి వాళ్ళ, ఏమొఖంతో బేటాలియన్ తో ఊర్లు తిరుగుతున్నారు అని స్థాయిని మించి కాంగ్రెస్ ఇంచార్జి నాయకులు సోయి తప్పి మాట్లాడము బంధు చేసుకోవాలి అన్నారు, తెరాస పార్టీ నాయకులు మంగన్న గారి బల్వంత్ రెడ్డి మాట్లాడుతూ 70 యేండ్లలో కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ ఏ ఎమ్మెల్యే చేయని పనులను బజాప్త గా చేసి అభివృద్ధి అంటే ఏందో చూపించాడు అని, డిపాజిట్ తెచ్చుకోవడానికి షేత గాని పార్టీ షాద్ నగర్ లో శాంధార్ అంట్టారా బుద్దిలేక, పిచ్చి ప్రేలాపన మాటలు బంధుచేసుకొని రాజకీయా బుద్దులు నేర్చుకోoడి అన్నారు.తెరాస పార్టీ అధ్యక్షులు ఎలుగంటి శ్రీధర్ రెడ్డి మాట్లాడు తు గత 8 సంవస్స రాలుగా ఏ ఎమ్మెల్యే లు షాద్ నగర్ నియోజకవర్గం అభివృద్ధిని చేయలేదు కానీ తక్కువ సమయంలో ఎమ్మెల్యే గా అంజన్న అన్ని గ్రామాలకు బీటి రోడ్లు, సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాలు, మంజూరి చేపిస్తు cmr ద్యారా ఎంతో మందికి సహాయం చేస్తూ, కొత్త గ్రామ పంచాయతీ లు చేసి గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్నారు అని, ప్రజా ప్రతి నిధులుగా గెలువని వారు కేసీఆర్ ని ఎమ్మెల్యే గారిని వారి కుటుంబ సభ్యులను వ్యక్తి గత దూషణలు చేయడం మంచిది కాదు అని కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు బాగా లేవు అని, అనే దైర్యం లేదూ ఇంతకంటే మించిన పతకాలు కాంగ్రెస్ వస్తే ఇస్తాము అని దైర్యం లేదు రాష్ట్రము లో మూడవ స్థానము లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ ఉనికిని కాపుడుకునే దానికి రెచ్చగొట్టే పదాలను వాడుతు ఎమ్మెల్యే గారి పైన కుటుంభం పైన ఆరోపణలు చేస్తే ఊరుకొ నేది లేదు అని ఎమ్మెల్యే గారు కొందుర్గు మండలము లో అభివృద్ధి చేయలేదు అంటే బైరంగా చర్చకు సిద్ధమా అన్నారు.. కాంగ్రస్ పార్టీ ఎక్కడ కార్యక్రమం పెట్టిన వెంటనే ఆగ్రామాలలో తిప్పి కొట్టె కార్యక్రమాలు చేస్తాము అని కాంగ్రెస్ వాళ్లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అన్నారు... పాల్గొన్న amc డైరెక్టర్ రాజా రామేశ్వర్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు దర్గా రామ చెంద్రయ్య, నాయకులు లంకాల రామ కృష్ణా రెడ్డి, ఆకుల శ్రీశైలం, పిన్నిమల మహేశ్వర్ రెడ్డి, మాదేపూర్ సర్పంచ్ గుర్ల రామ చెంద్రయ్య, గొల్ల యాదయ్య, అన్నారం రవీందర్ గౌడ్, గుర్ల గణేష్, మచ్చేందర్ గౌడ్, సాయి, రాజకుకుమార్, సంగళ్ల ఎల్లప్ప, జంగయ్య, రామ చెంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: