బోనకల్ మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం

Published: Thursday February 10, 2022
బోనకల్, ఫిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో విషం చిమ్మిన మోడీ వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్, మరియు జడ్పీ చైర్మన్, మధిర నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ఆదేశాలు మేరకు బోనకల్ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను బోనకల్ స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్డు నందు దహనం చేసినారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి మోదుగు నాగేశ్వరరావు, రైతు బంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్, జిల్లా కమటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, మండల కమిటీ సభ్యులు హనుమంత రావు, దరగాని నారాయణ, వెనిగళ్ళ మురళి, ఇటికల శ్రీనివాస రావు, కాకాని శ్రీనివాస రావు, షేక్ వజీర్, వీరయ్య, షేక్ మదర్, షేక్ బాషా, షేక్ హుస్సేన్, బొమ్మకంటి సైదులు మరియు తమ్మారపు బ్రహ్మయ్య, రావినూతల గ్రామ అధ్యక్షులు బంధం తిరుపతిరావు, చెరుకు రామకృష్ణ, యనమద్ది శ్రీనివాసరావు, దొప్ప కృష్ణ మరియు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.