సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి : ప్రిన్సిపాల్ వి.సంతోష్ కు

Published: Thursday September 23, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ఆదిలాబాద్ రీజియన్ మంచిర్యాల జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల కాసిపేట కళాశాలలో సిఈసి, ఎం ఇ సి గ్రూపుల్లో మిగిలిన సీట్లకు(బాలురు) దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ వి.సంతోష్ కుమార్ తెలిపారు. గత విద్యాసంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణత అయినవారి నుండి దరఖాస్తులు కోరుతున్నామని అట్టి దరఖాస్తులు ఈ నెల 23 నుండి 26 వరకు కళాశాల పని దినాలలో సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం స్వీకరించిన దరఖాస్తులను వారి ప్రతిభ మరియు రిజర్వేషన్ల ఆధారంగా అడ్మిషన్ కమిటీ ద్వారా అడ్మిషన్లు భర్తీ చేయబడునని ఆయన తెలిపారు. అడ్మిషన్ దరఖాస్తుతో పదవతరగతి మేమో, టిసి, బోనఫైడ్, కుల, నివాస, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలను, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, జత చేసి దరఖాస్తు చేసుకోవాలని వివరాలకు 7995010572 సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.