పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలి

Published: Wednesday September 22, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : సోమవారం రోజు ఇబ్రహీంపట్నం మండల టిఆర్ఎస్ పార్టీ నూతనంగా ఎన్నుకోబడిన పార్టీ మండల అధ్యక్షులు చిలకల బుగ్గ రాములు, ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి భాస్కర్ రెడ్డి తెరాస రాష్ట్ర  యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ ని మర్యాదగా పూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మా పై నమ్మకంతో మండల అధ్యక్ష కార్యదర్శులు నియమించినందుకు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి, తెరాస రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శులను తెరాస రాష్ట్ర యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ), ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి కృపేష్  వారిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది.. ఈ సందర్భంగా గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ బలోపేతంతో పాటు నిరంతరం కార్యకర్తలకు అందుబాటు ఉంటూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలో కు తీస్కొని వేలాలి అని మరియు పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని వారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వైస్ ఎంపీపీ మంచి రెడ్డి ప్రతాప్ రెడ్డి,ఎంపీటీసీ ఫోరం ఏనుగు భారత్ రెడ్డి,జంగయ్య,తెరాస నాయకులు మంకాల దాస్, TRSV జిల్లా నాయకులు నిట్టు జగదీశ్వర్, చెరుకూరి రవీందర్, సర్పంచ్ చిలకల బుగ్గ రాములు, మాజీ సర్పంచ్ దొడ్డి బీరప్ప, వీరయ్య, నిమ్మల ప్రసాద్ గౌడ్, దొండ మనీష్ రెడ్డి, యాదగిరి, ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.