మాటూరు కరోనా పేషెంట్స్ కి చెక్ పోస్ట్ వాలంటీర్లకు మాటూర్ హైస్కూల్ ఉపాధ్యాయులచే అన్నదాన విత

Published: Friday June 18, 2021
మధిర, జూన్, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని మాటూరు ఉన్నత పాఠశాలలో క్వారంటైన్ లో ఉన్నటువంటి కరోనా పేషంట్స్ కు మాటూరు క్రాస్ రోడ్ లో విధులు నిర్వహిస్తూన్న వాలంటీర్స్ కి మాటూరు హైస్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది ఈరోజు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం వితరణగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మధిర మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ గారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో చేయూత నివ్వడానికి ముందుకు వచ్చినటువంటి పాఠశాల సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి నాగేశ్వరరావు ఎంపిటిసి అడపాల వెంకటేశ్వర్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయి కృష్ణమాచార్యులు, సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాం, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, వేము రాములు మహమ్మద్ బేగం, గుంటుపల్లి రమాదేవి, వేములపల్లి సత్యనారాయణ, ఆటో వలి, జానీ తదితరులు పాల్గొన్నారు.