తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు .

Published: Thursday January 13, 2022
వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమయ్య
మంచిర్యాల బ్యూరో‌, జనవరి12, ప్రజాపాలన : తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర కార్యవర్గం లో పలువురిని కొత్త గా చేర్చి  పలు చేర్పులు మార్పులు చేసినట్లు ఆ సంఘం  వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంఘం గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ బాధితుల సమస్యలపైన పోరాడుతూ చనిపోయిన గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని అన్నారు.  ఇబ్బందుల్లో ఉన్న గల్ఫ్ కార్మికులకు జాతీయంగానే కాకుండా అంతర్జా తీయంగా తమ సేవలను , ఆర్థిక సహాయలు అందజేస్తూ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి  అవగాహన కల్పిస్తూ అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కార్యవర్గ మార్పు లలో  రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుగా సేపురి గోపాల్, ఉపాధ్యక్షుడుగా పురంషెట్టి నగేష్ , వర్కింగ్ ప్రెసిడెంట్ అమరకొండ తిరుపతి,  ప్రధానకార్యదర్శిగా పెరుగూ మల్లికార్జున్, కన్వీనర్ గా సంద సుదర్శన్,  కోశాధికారిగా అమరకొండ మల్లేష్ ,   ఇంఛార్జిగా ఎరుకల రాజుగౌడ్, కార్యదర్శిగా  జునుగురి నాగరాజు, ప్రచార కార్యదర్శిగా మహ్మద్ హాసన్,   అదేవిధంగా సలహాదారులుగా మగ్గిడి తిరుపతి లను నియమించడం జరిగిందని ఆరన తెలిపారు.