వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జమ్మి పంపిణీ

Published: Friday October 07, 2022

మంచిర్యాల టౌన్, అక్టోబర్ 06, ప్రజాపాలన: దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గోదావరి తీరంలోని గౌతమేశ్వర ఆలయం వద్ద పంపిణీ కార్యక్రమం చేపట్టారు . ఈ కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్ , మంచిర్యాల సిఐ నారాయణ నాయకులు పాల్గొని గౌతమేశ్వరాలయం వద్ద శమీ పూజకు వచ్చిన వారికి వాసవి క్లబ్ జమ్మి పాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వాసవి క్లబ్ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లో మమేకంగా నిలుస్తుందని కొనియాడారు . ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మంచిర్యాల అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ , జోన్ చైర్మన్ కాచం సతీష్, కొంకుమటి వెంకటేశ్వర్లు , క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాల మోహన్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు సిరిపురం శ్రీనివాస్, దొంతుల ముఖేష్ , కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ, కొండ చంద్రశేఖర్ తో పాటు వాసవి క్లబ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.