బాదంపెళ్లి కేంద్రంగా అక్రమ ఇసుక దందా

Published: Wednesday January 18, 2023

జన్నారం, జనవరి 17, ప్రజాపాలన: మండలంలోని బాదంపల్లి కేంద్రంగా అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది. అధికారుల అండతో గోదావరి పరిసర ప్రాంతాల నుండి ఇసుక రవాణా జోరుగా కొనసాగిస్తున్నారు. గోదావరి పరిసర ప్రాంతాలనుండి జెసిబి లతో వందలాది ట్రాక్టర్లులతో ఇసుకను తోడేస్తున్నారు. ట్రాక్టర్లతో ఇసుకను తీసుకువచ్చి బాదంపల్లి, చింతలపల్లి, పొనకల్, శివారులలో డంపులగా వేసి ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. గోదావరి అక్రమ ఇసుక తీయడంతో గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటి పోయే అవకాశాలు ఉన్నాయని స్థానిక ప్రాంత గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్, అటవీ అధికారులు స్పందించి అక్రమా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ లను సీజ్ చేయాలని స్థానిక గ్రామస్తులు కోరుచున్నారు. గోదావరి నుండి అక్రమ ఇసుక రవాణా చేయడం ట్రాక్టర్ యజమానుడు లక్షలాది రూపాయలు సొమ్ముచేసుకుంటున్నారు