విజయవంతమైన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం

Published: Thursday February 25, 2021
కొత్తగూడెం, ఫిబ్రవరి 24 ప్రజా పాలన ప్రతినిధి: కొత్తగూడెం క్లబ్ లో టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం - నల్లగొండ - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశం విజయవంతమైంది, ఈ సమావేశం గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన సభ విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య,తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు బి. వెంకట్రావు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాతా మధు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్ర రావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డి సి ఎస్ ఎం వైస్ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, ఎంపీపీ లు బాదవత్ శాంతి, విజయలక్ష్మి, భూక్యా సోన మరియు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.