మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనుల పరిశీలన

Published: Wednesday May 11, 2022

మెట్ పల్లి, మే 10 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ కేంద్రంలో గల పెద్ద చెరువును కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు డా:సంజయ్ పరిశీలించి, చెరువుని మినీ ట్యాంక్ బండ్ గా మార్చడానికి కావాల్సిన నిధులను మున్సిపల్ మంత్రి కేటీఆర్ తో మాట్లాడి మంజూరు చేపిస్తానని, ఒక నెలలోపు పనులు పూర్తి చేయాలనీ అధికారులని, ప్రజాప్రతినిధులని ఆదేశించారు. ఒకే నియోజకవర్గంలో రెండు మినీ ట్యాంక్ బండ్ లు మంజూరైన ఏకైక నియోజకవర్గం మనదని ఈ సందర్బంగా అన్నారు.