శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని కూల్చివేసిన -మున్సిపల్ అధికారులు

Published: Saturday July 16, 2022

రాయికల్, జూలై 15 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణంలోని గాంధీ విగ్రహంచౌరస్తా వద్ద శిథిలావస్థకు చేరుకున్న 3 దుకాణముల సముదాయము గల భవనము గత ఐదురోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గురువారము  భవనం వెనుక భాగం కూలిపోయిందన్నవిషయం తెలుసుకొన్న మున్సిపల్ అధికారులు జెసిబి తో కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గండ్రారమాదేవి, కమిషనర్ గంగుల సంతోష్ కుమార్  మేనేజర్ వెంకటి, జూనియర్అసిస్టెంట్ గంగనరసయ్య పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.