చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి
వలిగొండ, ఆగస్టు 04, ప్రజాపాలన ప్రతినిధి : పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలకు నిరసనగా యూవజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి శ్రీనివాస్ పిలుపు మేరకు 5 వ తేదిన యూవజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో డిల్లీ కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ ముట్టడి కి తెలంగాణ నుండి బుధవారం ఉదయం యూవజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి మరియు యూవజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వెలిమినేటి సురేష్ ఢిల్లీ కి బయల్దేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు సామాన్యుడి నడ్డి విరిచే లా ఉన్నాయని, కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుతూ సామాన్యుడి పై మరింత భారం పెంచుతున్నారు అని అన్నారు. నరేంద్రమోడి నిరంకుశ పాలనన, ఆయన అనుసరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను ఖచ్చితంగా ఎండగడుతామని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయని కేంద్రంలో రాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వమే అని వారు అన్నారు.
Share this on your social network: