పచ్చదనంతో పీర్జాదిగూడ కార్పొరేషన్ శోభిల్లాలి : మేయర్ జక్క వెంకట్ రెడ్డి
Published: Thursday July 08, 2021
పచ్చదనం పరిశుభ్రతతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ శోభిల్లేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ కార్పొరేటర్ బండారు మంజుల రవీందర్ ఆధ్వర్యంలో విహరిక కాలనీలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ పాల్గొని సమస్యలపై చర్చించారు. డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, అన్ని విధాలుగా డివిజన్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని మేయర్ వెంకట్ రెడ్డి తెలిపారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాస్, ఏఈ వినీల్ కుమార్, నాయకులు బండారు రవీందర్, సుమిత్, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: