ఘనంగా తెలంగాణ భీమా సర్వేయర్స్ సంక్షేమ సంఘం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

Published: Monday March 14, 2022
మేడిపల్లి, మార్చి13 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ భీమా సర్వేయర్స్ సంక్షేమ సంఘం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను సెలబ్రిటీ రిసార్ట్ లో సంఘం అధ్యక్షులు గుర్రం నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐ ఐ ఐ ఎస్ ఎల్ తెలంగాణ చైర్మన్ కె కొండల్ రెడ్డి, వీకే గద్రే, సీనియర్ సర్వేయర్, జోనల్ మేనేజర్ ఎస్ విజయా రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పడాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమా సర్వేయర్ల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమా సర్వేయర్స్ కమిటీ కోశాధికారి మల్లికార్జున్ రావు, సభ్యులు జాన్సన్, జి ఎం కుమార్, బర్పటి ప్రసన్నకుమార్, శివ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.