ప్రభుత్వ దవాఖానాలో అత్యాధునిక సేవలు

Published: Tuesday March 29, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 28 మార్చి ప్రజాపాలన : ప్రభుత్వ దవాఖానాలో అత్యాధునిక సేవలు అందిస్తున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో గల ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో యునైటెడ్ వే సంస్థ వారు నూతంగా ఏర్పాటు చేసిన ఐసియు బెడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.