గడప గడపకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు
Published: Tuesday March 08, 2022
కార్పొరేటర్ సుభాష్ నాయక్
మేడిపల్లి, మార్చి 7 (ప్రజాపాలన ప్రతినిధి) : గడప గడపకు టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయనీ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ కేతావత్ సుభాష్ నాయక్ పేర్కొన్నారు. మహిళా బంధు కేసీఆర్ సంబరాల్లో భాగంగా డివిజన్లోని ఎస్ వి కాలనీలో కార్పొరేటర్ డాక్టర్ కేతావత్ సుభాష్ నాయక్ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్టు, అసరా పథకం లాంటి పథకాల లబ్దిదారులను పలకరిస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల బాల్ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు రామోజు, శంకర్, చారి, వార్డ్ ఆఫీసర్ గోవింద్, ఎస్ వి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పి.రాధాక్రిష్ణా, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సయ్య, కాలనీ సభ్యులు గంగులు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: