డాక్టర్ అంబేద్కర్ మహానీయుడు.. జేఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ వై రాధాకృష్ణ..

Published: Saturday April 15, 2023
 తల్లాడ(ఖమ్మం), ఏప్రిల్ 14 (ప్రజాపాలన న్యూస్):
జనశిక్షన్ సంస్థాన్ ఆధ్వర్యంలో  డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ శుక్రవారం ఖమ్మం జిల్లాలోని అన్ని కేంద్రాల్లో నిర్వహించారు.  ఖమ్మం పట్టణం ముస్తఫానగర్లోని చెవిటి మూగ, అంధుల పాఠశాలలో అంబేద్కర్ ఫోటో కు డైరెక్టర్ రాధాకృష్ణ దండ వేసి, అంబేద్కర్  మనకు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా స్వేచ్చ గా స్వాతంత్రంగా జీవిస్తున్నాము అంటే అది కేవలం రాజ్యాంగం ఇచ్చిన హక్కులవలననే అని తెలియజేశారు.దంసలాపురం, చర్చ్ కాంపౌండ్,సుగ్గాలవారితోట నందు ఉచిత టైలరింగ్, బ్యూటిషన్ ఎంబ్రాడర్ శిక్షణ పొందుతున్న లబ్ధిదారుల సెంటర్స్ లలో ఖమ్మం జిల్లా  డైరెక్టర్ రాధాకృష్ణ పాల్గొని అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి బర్త్ డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో యస్ కె రజియా,రిసోర్స్ పర్సన్స్ జాస్మిన్, కవిత, చాందిని, జులేఖ బేగం, శాంతి, అనిత, చంద్రకళ, ప్రశాంతి, నాగమణి, కాలంగి మేరీ నాగేశ్వరావు పాల్గొన్నారు.