జొన్నలగడ్డ రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీ చైర్మన్
Published: Monday December 12, 2022
బోనకల్, డిసెంబర్ 11 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం (ఎల్) గ్రామ ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత శ్రీనివాస్ మామ జొన్నలగడ్డ రామయ్య ఇటీవల మరణించగా వారి దశాదిన కర్మ కు ఆదివారం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరై వారి చిత్రపటానికి పూలమాల తో నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్, టిఆర్ఎస్ నాయకులు వెనిగండ్ల మురళి, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: