ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం

Published: Friday July 02, 2021

మంచిర్యాల టౌన్, జూలై 01, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లాలో ట్రస్మా జిల్లా నాయకులు జులై ఒకటో తేదీ జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా వైద్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రాపోలు విష్ణు వర్ధన్ రావు మాట్లాడుతూ ఈ కరోనా కష్టకాలంలో వైద్యుల సేవలు అద్వితీయమైనవని కొనియాడారు. ఈ కరోనా కాలంలో వేలాది మంది కరోనా రోగులను రక్షించడంలో, వారి కుటుంబ సభ్యులకు మేమున్నామని భరోసా ఇవ్వడంలో వైద్యుల పాత్ర గణనీయమైనది అని తెలిపారు. అదేవిధంగా తమ జీవితాలను సైతం తృణప్రాయంగా భావించి కరోనా వ్యాధి గ్రస్తుల దగ్గర ఉండి, వారికి స్నేహపూరితమైన సహృద వాతావరణంలో చక్కటి వైద్యాన్ని అందించి వారు త్వరితగతిన కోలుకోవడంలో వైద్యుల పాత్ర అద్భుతమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సురభి శరత్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కస్తూరి పద్మ చరణ్, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.