దసరా పండుగకు అత్యవసర ఏర్పాట్లు
Published: Wednesday October 13, 2021
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 12 అక్టోబర్ ప్రజాపాలన : దసరా పండుగను పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్ అన్నారు. మంగళవారం దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దసరా పండుగ ఏర్పాట్లపై అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ.. గడిచిన 2021 వినాయక నిమజ్జనానికి సంబందించి పురపాలక సంఘం కార్యాలయం తరపున పట్టణములో వివిధ ఏరియాలలో రూ.3.88 లక్షలు, రాబోవు దసరా పండుగకు రూ. 9.60 లక్షలు కేటాయించామని వివరించారు. అత్యవసర సమావేశములో ఉన్న అంశములన్నింటిని కౌన్సిల్ ఆమోదం తెలపడం జరిగింది. వార్డు కౌన్సిలర్లు కొందరు దసరా సందర్భంగా వీధి దీపాల ఏర్పాట్లు సరిగ్గా చూడాలని, రోడ్లపై డస్టు వేయాలని వివిధ ఏరియాలలో ఉన్న గుంతలను పూడ్చాలని కోరగా మున్సిపల్ చైర్ పర్సన్ అట్టి పనులను త్వరిత గతిన పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Share this on your social network: