నిరుపేదలకు అండగా జనసేన..చార్వాకుడు

Published: Tuesday July 26, 2022
తల్లాడ, జులై 25 (ప్రజా పాలన న్యూస్): నిరుపేదలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు తుపాకుల చార్వాకుడు అన్నారు.
సోమవారం తల్లాడ మండలంలోని
కలకోడిమ గ్రామానికి చెందిన బుర్రి కుమారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు. కుమారి ఈనెల 15న మృతి చెందటంతో పేదకుటుంబం కావడంతో ఆ కుటుంబానికి జనసేన పార్టీ సభ్యులు 2600 నగదును ఖర్చుల నిమిత్తం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన విద్యార్థి ఎగ్జిక్యూటివ్  నెంబర్ చాంద్ పాషా, జనసేనయూత్ వింగ్స్ గోపి, సాయి, కమల్, అసాన్, నరేంద్ర,  మణికంఠ రెడ్డి, తిరుమల్ రెడ్డి,  పాల్గొన్నారు.
 
 
 
Attachments area