రహదారి వెడల్పు పై జాప్యాన్ని విడనాడాలి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చిరంజీవి నవ తెలంగాణ ఆసిఫా
Published: Tuesday June 28, 2022
జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ చెక్ పోస్ట్ నుండి ఆదిలాబాద్ ఎక్స్ రోడ్డు వరకు రోడ్డు వెడల్పు చేయడంలో అధికారులు చేస్తున్న జాప్యాన్ని విడనాడాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పెరిగిందని అధికారులు దీనికనుగుణంగా రోడ్డు వెడల్పు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గతంలో ఉన్న అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ నుండి ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ వరకు మార్కింగ్ చేశారని గుర్తు చేశారు. అయితే ఆ పనులు అక్కడే ఆగిపోయాయని, మార్కింగ్ చేసిన వరకు వెంటనే తొలగించి రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: