కమలమ్మకు కూచిపూడి, నల్లమోతు నివాళులు..

Published: Wednesday December 14, 2022
తల్లాడ, డిసెంబర్ 12 (ప్రజా పాలన న్యూస్): 
 తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన పేరసాని కమలమ్మ (70) మంగళవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు, గోపాలపేట గ్రామ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన వారిలో పేరసాని వెంకటయ్య, పేరసాని సత్యనారాయణ, రాజేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.