సేవకు దక్కిన పురస్కారం

Published: Tuesday April 26, 2022
మధిర ఏప్రిల్ 25 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం జరిగిన హైదరాబాద్అవార్డు దక్కినమధిర సేవా సమితి సభ్యులు గత 20 సంవత్సరాల క్రితం మధిర సేవా సమితి స్థాపించి కుల, మత, రాజకీయాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మధిర ప్రజల మన్నలను పొందిన మధిర సేవా సమితి కి జాతీయస్థాయి పురస్కారం పొందటం అభినందనీయం. హైదరాబాదులో విశ్వజనని ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విశ్వజనని జాతీయ సేవా రత్న అవార్డు పొందటం మధిర ప్రాంత ప్రజలకు గర్వకారణం. ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని విశ్వజనని ఫౌండేషన్ వారు మధిర పట్టణంలో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను గుర్తించి మధిర సేవా సమితి అధ్యక్షులు పల్లపోతూ ప్రసాదరావు, ఉపాధ్యక్షులు కొమిటీడీ శ్రీనివాసరావు పబ్లిక్ రిలేషన్ చైర్మన్ షేక్ జహంగీర్ లకు విశ్వ జనని జాతీయ సేవా రత్న అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సినీ నటులు రాగిణి, కిరణ్, కార్తికేయ రామోజీ ఫిలిం సిటీ జనరల్ మేనేజర్ టి ఆర్ ఎల్ రావు, మామిడి అనిత రెడ్డి మరియు విశ్వ జనని ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మానందం చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పల్లపోతూ ప్రసాదరావు మాట్లాడుతూ మధిర పట్టణంలో మధిర సేవా సమితి స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ముందు ముందు కూడా మధిర సేవ సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందుతాం అన్నారు.