శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నందు పూర్ణాహుతి కార్యక్రమం

Published: Saturday April 01, 2023
ఎర్రుపాలెం మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి:శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జమలాపురం క్షేత్రం నందు శుక్రవారం మహా పూర్ణాహుతి కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ప్రాత కాల అర్చన అనంతరం శ్రీవారి యాగశాల నందు మహా పూర్ణాహుతి కార్యక్రమమును అర్చక స్వాములు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆలయం
 ప్రాంగణము నందు బలిహరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత తొమ్మిది రోజులుగా నిర్వహించిన ఉత్సవములు ముగిసినట్లు సూచికగా స్వామివారి ధ్వజ పతాకము అవరోహణము గావించడం జరిగింది. అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్దకు స్వామి వారిని మేళతాళములతో తోడ్కొని వెళ్లి చక్రస్నాన కార్యక్రమం నిర్వహించినాము ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ బి శ్రీనివాస్, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, అర్చకులు, సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొని స్వామి వారితో పాటు స్నానము ఆచరించినారు. సాయంత్రం 5-30 గంటల నుండి దేవాలయం పైన ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించినాము.