గంజాయి గుట్కా విక్రయించే వారిపై కఠిన చర్యలు
Published: Thursday November 11, 2021
రాయికల్, నవంబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ ఎసై పబ్బం కిరణ్ కుమార్ గౌడ్ స్ధానిక పోలీస్ స్టేషన్ లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గంజాయి అక్రమంగా అమ్మిన, కొన్న రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే గుట్కా విక్రయించిన కొన్న కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలై వారి ఉత్తమ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని యువత దుర అలవాట్లకు దూరంగా ఉండాలని ,వీటిపై అవగాహన సదస్సు నిర్వహిస్తమని తెలిపారు.
Share this on your social network: