మల్లాపూర్ మండలంలో అన్ని గ్రామాల్లో మహోద్యమంగా కోటి వృక్షర్చన

Published: Thursday February 18, 2021
మల్లాపూర్, ఫిబ్రవరి17 ( ప్రజాపాలన ): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు పురస్కరించుకుని కోటి వృక్షర్చన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మల్లాపూర్ కేంద్రంతో పాటు మండలంలో అన్ని గ్రామాల్లో పోటాపోటీగా మహోద్యమంగా కోటి వృక్షర్చన కార్యక్రమాన్ని మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు మొక్కలు నాటుతూ, కేక్ కాట్ చేస్తూ, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  భాగంగా కుస్తాపూర్, రత్నపూర్ గ్రామ సర్పంచులు సరికేల లక్ష్మీ - మహిపాల్, మేడి అనూష - వినోద్ కుమార్ వారి గ్రామాల్లో మొక్కలు నాటి, కేక్ కాట్ చేసి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కెసిఆర్  పుట్టినరోజు సందర్భంగా కోటివృక్షర్చన విజయవంతంగా చేయడం జరిగింది. ఇరు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ కోటి వృక్షర్చన ను పండగ భావించి గ్రామాల్లో 1000 మొక్కలు నాటమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు ప్రదీప్, గోల్కొండ లయ అనిల్, సెక్రెటరీ నరేష్ టి ఏ సరిత, మాజీ ఉప సర్పంచ్ బోడ విజయ్ వార్డు మెంబర్లు లావణ్య సతీష్ కో ఆప్షన్ సభ్యులు గడ్చంద లింగయ్య, సి ఏ శివకుమార్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, అంగన్వాడి, ఆశ వర్కర్ల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.