పాలీసెట్ ఎంట్రన్స్ లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిన మాటూరు హైస్కూల్ విద్యార్థి సాదం రామకృ

Published: Thursday July 29, 2021
మధిర రూరల్, జూలై 28, ప్రజాపాలన ప్రతినిధి : వెలువడిన తెలంగాణ పాలిసెట్ ఎంట్రన్స్ లో మాటూరు హైస్కూల్ విద్యార్థి సాదం రామకృష్ణ అగ్రికల్చర్ విభాగంలో స్టేట్ 16వ ర్యాంకు ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ 37వ ర్యాంకు సాధించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయికృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సంవత్సరం బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు కూడా ఈ ఎంట్రన్స్ లో వచ్చిన ర్యాంకు ద్వారానే అడ్మిషన్లు జరుపనున్న సందర్భంలో తీవ్రమైన కాంపిటీషన్ ఎదుర్కొని గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం చాలా గొప్ప విషయంగా పేర్కొన్నారుస్టేట్ ర్యాంక్ సాధించిన రామకృష్ణ ను మాటూరు గ్రామ సర్పంచ్ శ్రీమతి మేడిశెట్టి లీలావతి ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు ఎస్ఎంసి చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణారావు, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు.