విద్యార్థులు ఇష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలు

Published: Saturday January 07, 2023
మానకొండూర్ జనవరి 05 ప్రజాపాలన రిపోర్టర్ శంకరపట్నం:

మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన బోధనా అభ్యాసన సామాగ్రి మేళా కార్యక్రమమును ఈరోజు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ   కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు
ఈ కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన బోధనా పరికరాలను పరిశీలించి, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎమ్మెల్యే రసమయి  తిలకించి అభినందించారు.