వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం

Published: Friday March 18, 2022
మంచిర్యాల బ్యూరో, మార్చి 17, ప్రజాపాలన: మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు నిరుపేదలకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం నిర్వహించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు గుండా లత - శ్రీనివాస్ హోల్ సేల్ ఫైర్ వర్క్స్ సహకారంతో వారి కుమారుడు గుండా సుమంత్ కు ఉద్యోగం వచ్చిన సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు వేయి మంది కి రైల్వే స్టేషన్ ముందు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు కటకం హరీష్, క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ దొంతుల ముఖేష్, సిరిపురం శ్రీనివాస్, జిల్లా వి కె ఎస్పీ ఇంచార్జ్ అప్పాల శ్రీధర్, రీజియన్ చైర్మన్ వుత్తూరు రమేష్, జోన్ చైర్మన్ కాచం సతీష్, వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, కోశాధికారి మల్యాల శ్రీనివాస్, సభ్యులు గుండా మనోహర్, పడకండి శ్రీనివాస్, ముస్య్తాల శ్రీనివాస్, యెర్రం వెంకటేష్, కొత్త కృష్ణ , పాత సాయి సూరజ్, చందూరి ప్రభాకర్, బాశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.