వినియోగదారులు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

Published: Tuesday March 16, 2021

ప్రజాపాలన - క్యాతనపల్లి, 15 మార్చి : పురపాలక సంఘం రామకృష్ణాపూర్ పట్టణం రాజీవ్ చౌక్ లో ఆరోగ్య హక్కు వేదిక అధ్యక్షుడు మోతె రాజలింగు వినియోగదారుల హక్కుల, రక్షణ కరపత్రాలను అందజేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వినియోగదారులు హక్కులు, రక్షణపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకొని పలు సంస్థలు, వ్యక్తులు మోసాలకు పాల్పడుతన్నారని అన్నారు. హక్కుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఏదో ఓ చోట వినియోగారుడు మోసపోతూనే ఉన్నాడని తెలిపారు. మార్కెట్ ఏది కల్తీనో, ఏది అసలో గుర్తించడం చాలా కష్టం అవుతుందని తెలియజేశారు. వినియోగించిన సమయంలో తగిన రశీదు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు సంపత్, శ్రీనివాస్, రాజు, మహేష్, తదితరలు పాల్గొన్నారు.