ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి *కామ్రేడ్ సుగుణమ్మకు విప్లవ జోహార్లు. - సీప

Published: Tuesday December 27, 2022

సీపీఎం సీనియర్ నాయకురాలు కామ్రేడ్ గడ్డం సుగుణమ్మ మరణం పార్టీకి తిరనిలోటని సీపీఎం మండల నాయకులు అమనగంటి వెంకటేష్ అన్నారు ఇబ్రహింపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి గడ్డం గణేష్ వల్ల మాతృమూర్తి సుగుణమ్మ మరణించారు. అమే మృతదేహంపై సీపీఎం పతాకాన్ని కప్పి నివాల్లర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ సుగుణమ్మ భూమి కోసం, భుక్తి కోసం, శ్రామిక వర్గాల విముక్తి కోసం, పటేల్ పెత్తందార్ల అరాచకాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొన్నరని అయన అన్నారు. అమే అకాలమరణం చాలా బాధాకరం అని  మరణం సీపీఎంకి తీరని లోటని అయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నట్లు  తెలిపారు.
అంత్యక్రియల్లో మాజీ వైస్ ఎంపిపి కొమ్మిడి శేఖర్ రెడ్డి, సీపీఎం నాయకులు చెరుకూరి నరసింహ, అశోక్, నర్సింహ, యాదయ్య, బాలరాజు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.