బెల్లంపల్లి ఆటో వర్కర్స్ కార్యవర్గం ఎంపిక

Published: Monday May 31, 2021

బెల్లంపల్లి, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణం టి ఎన్ టి యు సి ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ యూనియన్ కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు నాయకులు మని రామ్ సింగ్ తెలిపారు. ఆదివారం నాడు స్థానిక టిఎన్టియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టి ఎన్ టి యు సి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణ ఆటో వర్కర్స్ యూనియన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగాఎంపిక చేసినట్లు మనీ రామ్ సింగ్ తెలిపారు, అధ్యక్షుడిగా రామగిరి రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా భగవాన్ సింగ్, సంయుక్త కార్యదర్శిగా వెంకటేష్, ను నియమించినట్లు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజ్ కుమార్ పాండే, బెల్లంపల్లి రీజియన్ ఉపాధ్యక్షులు గద్దల నారాయణ, పట్టణ సంయుక్త కార్యదర్శి జీవరత్నం, బెల్లంపల్లి ఉపాధ్యక్షులు సిరికొండ కనకయ్య, చింతల రమేష్, ఎం డి బుకూర్, బొల్లు మల్లయ్య, రాజయ్య, గణేష్, గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపికైన  నాయకులను పట్టణ కమిటీ శాలువాలతో సన్మానించారు.