పెరిగిన డిజిల్ పెట్రోల్ ధరలకు యూత్ కాంగ్రెస్ నిరసన...
Published: Monday June 07, 2021
జగిత్యాల, జూన్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజల్ మరియు నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు నిరసనగా జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనాతో పాటు నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గుండ మధు మాట్లాడుతూ కారోనా కష్ట కాలంలో నిత్యావసర వస్తువులు ధరలు మరియు పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలని యువజన కాంగ్రెస్ తరపున కేంద్ర ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నక్క జీవన్ ఎండి నేహల్ బాస ప్రకాశ్ గంగాధర్ రాజ్ కాస సంజీవ్ లైశెట్టి విజయ్ రియాజ్ అనుదీప్ భీరం రాజేష్ సలీం హరీష్ శేఖర్ కళ్ళు శ్రీను సీసీ శివకృష్ణ మధు రాజశేకర్ రెడ్డి షకీల్ కిషోర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: