కులాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

Published: Thursday February 11, 2021

రాష్ట్ర బలహీన వర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట్ రాములు గౌడ్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 10 ( ప్రజాపాలన ) : ఆర్థికంగా వెనుకబడిన కులాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర బలహీన వర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట్ రాములు గౌడ్ అన్నారు. బుధవారం బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు బ్యాంక్ కన్సల్టింగ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల షూరిటీలు అవసరం లేకుండా ఎస్టీ కార్పోరేషన్ నుండి వాస్తవమైన అర్హులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వి.అమరేశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్యాట శంకర్, .డి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇ.నర్సింహాగౌడ్, రాష్ట్ర సంఘటన కార్యదర్శి వి.రాములు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మహమ్మద్ మన్సూర్ పాషా, మైపాల్ వికారాబాద్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.