రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన ఎస్సై ..

Published: Thursday September 22, 2022
ఏన్కూరు, సెప్టెంబర్ 21 (ప్రజా పాలన న్యూస్):
ఉసిరికాయల పల్లి లో వాటర్ స్పోర్ట్స్ స్కూల్, బోయినపల్లిలో 5 వ తరగతి ప్రవేశాల కొరకు నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో ఓం ఆదిత్య గాయత్రి స్కూల్ విద్యార్థులు మాలోత్ జీవన్ కుమార్, అజ్మీర కార్తీక్, బానోత్ కార్తీక్, బానోత్ రక్షిత్ లు రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ కొరకు అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులను బుధవారం  ఏన్కూర్ ఎస్సై సాయికుమార్ అభినందించారు. ఈ విద్యార్థులకు 22న హైదరాబాద్ లో సెలెక్షన్స్ ఉంటాయని ప్రిన్సిపాల్ దాసరి రమేష్ తెలిపారు.
ఏన్కూర్ మండలం నుండి వాటర్ స్పోర్ట్స్ స్కూల్ కి ఎంపిక కావడం ఇదే మొదటి సారి కావడం గర్వకారణం అని, భవిష్యత్ లో తిమ్మరావుపేట గ్రామం క్రీడావేదికగా అనేకమంది విద్యార్థులను సైనిక్ స్కూల్, స్పోర్ట్స్ స్కూల్ లలో ప్రవేశాలు పొందుటకు వేదికగా నిలుస్తుందని ఓం ఆదిత్య గాయత్రి స్కూల్ ప్రిన్సిపాల్ దాసరి రమేష్ ఆశభావం వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమం లో పిఈటి శోభన్, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.