కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ

Published: Monday June 28, 2021

జన్నారం, జూన్ 27, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డిని నియమించడంతో  మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రభుదాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘ ఆలోచనలు చేసి టి పి సి సి గా చివరికి యంగ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు జరుపుకుంటున్నారు అన్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం తథ్యమన్నారు, అనంతరం టెన్త్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో కూడా టపాసులు పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ రెడ్డి పసి ఉల్లాఖాన్ ఇంద్రయ్య కరుణాకర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.