అప్పుల బాధతో వ్యవసాయ కూలీ ఆత్మహత్య శంకరపట్నం జనవరి 28 ప్రజాపాలన రిపోర్టర్:
Published: Monday January 30, 2023
శంకరపట్నం మండలం కేశవపట్నం చర్లపల్లికి చెందిన వ్యవసాయ కూలీ సమ్ము శ్రీనివాస్ (41)శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం స్థానికంగా వ్యవసాయం వ్యవసాయ కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న శ్రీనివాస్, గత రెండు మూడు సంవత్సరాలుగా పంట దిగుబడి రాక, ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసైన శ్రీనివాస్ శుక్రవారం కూలి పనికి వెళ్తానని చెప్పి, భార్య, కూతురు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వారు తెలిపారు. మృతుడి బార్య పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Share this on your social network: