పార్లమెంట్లో‌‌ బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి : రాష్ట్ర ఉపాధ్యక్షులు ముగాల మహేష్

Published: Tuesday November 30, 2021
మంచిర్యాల బ్యూరో, నవంబర్29, ప్రజాపాలన : పార్లమెంట్లో‌‌ బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ బీసీ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు ముగాల మహేష్ అన్నారు. సోమవారం సి సి సి కార్నర్ లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇస్తు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీ జనాభా ఉంటే చట్ట సభలలో రిజర్వేషన్లు లేక పోవడం అంటే బీసీలను రాజకీయ వివక్షకు గురి చేయడమే అవుతుందని అన్నారు. ఇప్పటికైనా బిసి రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్ నస్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు దోంగరి లక్ష్మీకాంత్‌, పట్టణ కార్యదర్శి తోకల‌ మహేష్ తదితరులు పాల్గొన్నారు