అధికారకంగా మీర్ పేట్ కార్పొరేషన్ లో భాజపా ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్

Published: Thursday March 25, 2021

బాలాపూర్: (ప్రతినిధి) ప్రజా పాలన న్యూస్; మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భాజపా పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి వి నియమించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు సమక్షంలో జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి 25 వ డివిజన్ కార్పొరేటర్ కీసర గోవర్ధన్ రెడ్డి ని బిజెపి నేతల కార్యకర్తల మధ్య ఫ్లోర్ లీడర్ గా నియమించడం జరిగిందని అధ్యక్షులు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కొరకు కృషి చేయాలని కోరారు. నూతనంగా ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ........ బిజెపి పార్టీ సిద్ధాంత ఆదర్శాలకు నీతి , నిజాయితీ, నిబద్ధత క్రమశిక్షణ చిత్తశుద్ధితో నిస్వార్థంగా వ్యవహరిస్తానని ప్రతి ఒక్కరికి అదేవిధంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు గుర్తించి  ఉద్యమాలు చేపట్టడం బిజెపి పార్టీ ని  బలోపేతానికి పటిష్టం పరిచి అన్ని వర్గాల లో భాజపా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం ప్రభుత్వ పథకాలను ప్రజలలోనికి చేరే విధంగా ఆ పథకాలను  సద్వినియోగం చేసుకోవాలని చెప్తాను అన్నారు. పెద్దలు నా మీద పెట్టుకున్న నమ్మకంతో బాధ్యత అప్పజెప్పిన నమ్మకాన్ని విశ్వాసాన్ని వృధా చెయ్యనని హామీ ఇచ్చారు. నన్ను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని అన్నారు. అధికారకంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. సుమన్ రావు కు అదేవిధంగా మేయర్ కు ఫోటో కాల్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, బిజెపి సీనియర్ నాయకుడు మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి, సీనియర్ నాయకులు జంగయ్య యాదవ్, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ, మహిళా మోర్చా అధ్యక్షురాలు సుజాత, బిజెపి సీనియర్ కార్యకర్తలు బిజెపి నేతలు, సబిత రాజశేఖర్ రెడ్డి కార్పొరేషన్ కార్పొరేటర్లు పసునూరి బిక్షపతి చారి, నీలా రవి నాయక్, భీమ్ రాజ్, కరుణానిధి, శ్రావణ్ కుమార్, నరసింహ సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.