కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు

Published: Friday January 28, 2022

కోరుట్ల, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి): ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి నాయకత్వoలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా కోరుట్ల మండలం లోని పైడిమడుగు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జువ్వాడి కృష్ణారావు  మాట్లాడుతూ మత సామరస్యంతో కూడిన ప్రగతి మరియు మంచి సమ సమాజం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని ఈ సందర్భంగా కోరారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన, దేశాన్ని నిర్మించిన, తెలంగాణ తెచ్చిన, ఇచ్చిన గొప్ప పార్టీ కాంగ్రెస్ లో సభ్యత్వం తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జువ్వాడి కృష్ణారావు కోరడం జరిగింది. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల రూపాయల భీమాను కల్పిస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధానకార్యదర్శి కట్టేకొల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు జనార్ధన్, కాంగ్రెస్ నాయకులు తురగ స్వామి రెడ్డి, షాదీక్ లు పాల్గొన్నారు.