23 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన
Published: Tuesday June 22, 2021
మేడిపల్లి, జూన్ 21, (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ పి & టి కాలనీలో స్థానిక కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అంచనా వ్యయం 23 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు నగర మేయర్ జక్క వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ తో కలిసి కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి, కార్పొరేటర్లు అనంత రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు రాందాస్ గౌడ్, నాయకులు శ్రీధర్ రెడ్డి, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: