తొలిపొద్దు పర్యటనలో ఎమ్మెల్యే. మానకొండూరు శంకరపట్నం నవంబరు 12ప్రజాపాలన ప్రతినిధి :

Published: Monday November 14, 2022

మానకొండూర్ మండలంలో ఈరోజు తొలిపొద్దు పర్యటనలో భాగంగా మనకొండూర్, ముంజంపల్లి, ఖాదర్ గూడెం, చెంజర్ల ,కొండపల్కల, మరియు గంగిపల్లి గ్రామాలలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విస్తృతంగా పర్యటించి, లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కళ్యాణలక్ష్మీ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ నిరుపేద మహిళలను ఆదుకునేందుకు ఎంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శమని, కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టిందని గుర్తు చేశారు
టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి 1,00116/- రూ ఆర్దిక సహాయం అందించడంతో పాటు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  తెలిపారు.