జిల్లాలో ఘనంగా ప్లాంటేషన్ కార్యక్రమం.. జేఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ రాధాకృష్ణ..
Published: Thursday October 20, 2022
ఖమ్మం, అక్టోబర్ 19 (ప్రజాపాలన న్యూస్):
జనశిక్షన్ సంస్థాన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం, బల్లేపల్లి, రేగులచలక, ఉప్పలమడక, కొత్తవెంకటగిరి, గ్రామపంచాయతీలలో జె యస్ యస్ సెంటర్స్ లో ప్లాంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎస్ఎస్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ లబ్ధిదారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆదేశాల ప్రకారం భారతదేశంలోని అన్ని జనశిక్షన్ సంస్థాన్ ఆధ్వర్యంలో ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగినదన్నారు. మొక్కలను నాటడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రెసిడెంట్స్, సెక్రెటరీస్, ఎంపీపీ, స్కూల్ హెడ్ మాస్టర్, జె యస్ యస్ లబ్ధిదారులు, స్టాఫ్,రిశోర్స్ పర్సన్స్ జాస్మిన్, యస్ కె. రజియా, కవిత, మధార్ బీ, రమాదేవి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
Share this on your social network: