గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

Published: Wednesday September 14, 2022
జన్నారం, సెప్టెంబర్ 13, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ అంగన్వాడీ సెంటర్ ఉపాధ్యాయురాలు  జాడి సంజీవ, గంజాయిల జెమున, ఎఎన్ఎమ్ మాధవి లు గర్భిణీ బాలింతలు తప్పకుండ పౌష్టికాహారం తీసుకోవాలని మంగళవారం అన్నారు. స్థానిక గర్భిణీలకు పోషకాహార  వేడుకలలో భాగంగా పోషకాలపై అవహహన కల్పించి, గర్భిణీ స్త్రీలకు పోషకాలున్న కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు తదితర మెుదలైన మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యాక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ జాడి గంగాధర్, కార్యదర్శి లావణ్య, అయా, గర్భిణీలు, తదితరులు పాల్గొన్నారు.