విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి ఎస్ఐ సతీష్ కుమార్
Published: Friday July 08, 2022
మధిర జులై 7 ప్రజా పాలన ప్రతినిధివిద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మధిర టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ సూచించారు. గురువారంజడ్పీహెచ్ఎస్ మడుపల్లిలో 250 మంది విద్యార్థులకు సివిఆర్ చిట్స్ అధినేత చెరుకూరు వెంకటేశ్వరావు సుమారు 40వేల రూపాయలతో అందించిన నోటు పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. అనంతరం హెచ్ఎం కే పద్మావతి అధ్యక్షులు జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రమశిక్షణగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు వితరణగా అందించిన చెరుకూరు వెంకటేశ్వరావును ఆయన అభినందించారు. అదేవిధంగా భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకట రెడ్డి విద్యార్థులకు పెన్నులు బహుకరణ చేశారు. ఈకార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ వేల్పుల రాజేశ్వరి మాజీ సర్పంచ్ వేల్పుల బుజ్జి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: