సుందరయ్య నగర్ గణేష్ అసోసియేషన్ఆధ్వర్యంలో చివరి రోజు గణేష్ ఉత్సవాలు
Published: Thursday September 16, 2021
మధిర, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : టీచర్స్ కాలనీ సుందరయ్య నగర్ గణేష్ అసోసియేషన్ఆధ్వర్యంలో చివరి రోజు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈరోజు పీటల మీద కూర్చున్న దంపతులు కృష్ణయ్య జ్యోతి గార్లు, వెంకటేశ్వర్ రెడ్డి శ్రీదేవి, సాగర్ శ్రీలత. వీరే అన్నదాన వితరణ కూడా చేశారు వారికి గణేష్ కమిటీవారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. తదనంతరం గణేష్ ఉత్సవ కమిటీ చే నిర్వహించబడిన బంపర్ లక్కీ డ్రా ను తీయడం జరిగినది. దీనిలో మొదటి ప్రైజు హీరో సైకిల్ మరియు మూడో ప్రైస్ ఐరన్ బాక్స్ నారాయణరావు ధనలక్ష్మి దంపతులు గెలుచుకున్నారు. మిక్సీ ని మండూరు నరేష్ గెలుచుకున్నారు. లక్కీ డ్రా అనంతరం నిమజ్జన కార్యక్రమం మూడు గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుందని గణేష్ ఉత్సవ కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కమిటీ వారు తెలియజేశారు
Share this on your social network: